ఏపీలో పెరుగుతున్న క‌రోనా కేసులు.. రాజమండ్రిలో 21 ఏళ్ల యువకుడికి పాజిటివ్

ఏపీలో పెరుగుతున్న క‌రోనా కేసులు.. రాజమండ్రిలో 21 ఏళ్ల యువకుడికి పాజిటివ్

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మరో కరోనా కేసు (Corona Case) నమోదైంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో(Rajahmundry) తొలి కోవిడ్-19 కేసు నమోదైంది. 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అతడిని రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

తాజా కేసుతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16కు చేరింది. ప్రస్తుతం ఐదుగురు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, నలుగురు హోం ఐసోలేషన్‌లో (Home Isolation) వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం, ఇప్పటివరకు ముగ్గురు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు, రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ కారణంగా నలుగురు మరణించినట్లు స‌మాచారం.

జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment