హైదరాబాద్ అనాథ.. ప్రజారోగ్యంపై కాంగ్రెస్ నిర్లక్ష్యం

హైదరాబాద్ అనాథ.. ప్రజారోగ్యంపై కాంగ్రెస్ నిర్లక్ష్యం

Summarize with AI

బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) మంగళవారం బస్తీ దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ (Congress Party) స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో దానం నాగేందర్ (Danam Nagender) పేరును చేర్చడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియాతో మాట్లాడిన కేటీఆర్, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఏమాత్రం సిగ్గు లేదు. స్పీకర్ వద్ద ఒక అబద్ధం చెబుతూ, తాము పార్టీ మారలేదని ప్రజలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా నీతి ఉందా?” అని సూటిగా ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్: ప్రజారోగ్యం నిర్లక్ష్యం

ప్రజారోగ్యం (Public Health) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. “ముఖ్యమంత్రికి విజయోత్సవాలు జరుపుకోవడం కంటే ముందు ప్రజల ప్రాణాలను కాపాడటం ముఖ్యం. మున్సిపల్ మంత్రి లేకపోవడంతో హైదరాబాద్ నగరం అనాధగా మారింది. నగరం అంతా చెత్తతో నిండిపోయింది” అని విమర్శించారు. సిబ్బందికి జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడం, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీల జీతాలు పెంచకపోవడం సరికాదని కేటీఆర్ డిమాండ్ చేశారు.

బస్తీ దవాఖానాల్లో వసతులు లేవు: టిమ్స్ ముందు ధర్నాకు సిద్ధం

“కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాల్లో సరైన వసతులు లేవు. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉండడం లేదు. టిమ్స్ ఆసుపత్రుల ముందు వెయ్యి మందితో ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని కేటీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ ఆలోచన మేరకు కరోనా సమయంలోనూ ప్రజలకు వైద్యం అందించడానికి ఏర్పాట్లు జరిగాయని గుర్తు చేశారు. పేదల కోసం 450 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని, ఉచిత వైద్య పరీక్షల కోసం టీ డయాగ్నొస్టిక్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment