వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కుంచల సవీంద్ర రెడ్డి (Kunchala Savindra Reddy) అక్రమ అరెస్ట్ కేసులో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)హైకోర్టు (High Court) కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణను సీబీఐ(CBI)కి అప్పగిస్తూ, వచ్చే నెల 13వ తేదీ లోపు దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు స్పష్టం చేస్తూ, పోలీసులు ఈ కేసులో కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, అందువల్లే సీబీఐ సుమోటోగా స్వీకరించి విచారణ చేయాలని ఆదేశించింది.
సవీంద్రరెడ్డి లాయర్ వివరాల ప్రకారం.. పోలీసులు కోర్టులో సవీంద్రరెడ్డిని సాయంత్రం 7:30కు అరెస్ట్ చేశామని తెలిపారు. కానీ, నిందితుడు తాను 6:30కే అరెస్టయ్యానని వాదిస్తున్నాడు. కన్ఫెషన్ రిపోర్టులో 7:30కు అరెస్ట్ చేశామని రాసిన పోలీసులు, రిమాండ్ రిపోర్టులో మాత్రం 8:30కు అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ప్రత్తిపాడు పోలీసులు అరెస్టు చేశామని చెప్పినా, లాలాపేట ఎస్ హెచ్ ఓ శివప్రసాద్ (S.H.O .Shivaprasad) అరెస్ట్ చేసినట్లు సాక్ష్యాలు స్పష్టంగా చూపుతున్నాయి. అంతేకాదు, సాయంత్రం 7 గంటలకు సవీంద్రరెడ్డి సతీమణి పోలీస్ స్టేషన్కు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు ఉంది. ఈ విభిన్నతలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, కేసు దర్యాప్తును పూర్తిగా సీబీఐకి అప్పగించింది అని సవీంద్రరెడ్డి తరఫు లాయర్లు తెలిపారు. ఈ పరిణామంతో సవీంద్రరెడ్డి అరెస్ట్ కేసు మరింత ఆసక్తికర మలుపు తిరిగింది.








