మూడు ‘సీ’లు కలిస్తే దేశానికి క్షేమం?.. రఘువీరా రెడ్డి సంచలన వ్యాఖ్య

మూడు ‘సీ’లు కలిస్తే దేశానికి క్షేమం?.. రఘువీరా రెడ్డి సంచలన వ్యాఖ్య

Summarize with AI

దేశాభివృద్ధికి మూడు “సీ”లు (Three Cs) అనివార్యమని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి (Raghu Veera Reddy) వ్యాఖ్యానించారు. ఆ మూడు “సీ”లే – కాంగ్రెస్ (Congress), కమ్యూనిస్టులు (Communists), కంట్రీ (దేశం) (Country). ఈ మూడు కలిసినప్పుడే దేశం సుభిక్షంగా మారుతుందని ఆయన అన్నారు. కర్నూలు (Kurnool) లో నిర్వహిస్తున్న ఆలిండియా కిసాన్ సభ (AIKS) సదస్సులో పాల్గొన్న ఆయన, రైతుల (Farmers) హక్కుల కోసం జరిగిన పోరాటాలను గుర్తు చేశారు.

ఏఐకేఎస్ 90 ఏళ్ల క్రితమే ఏర్పడిందని, స్వాతంత్ర్య పోరాటం జరగకముందే రైతుల కోసం ఆ సంస్థ నిలబడి ఉద్యమాలు చేసిందని గుర్తుచేశారు. వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు రైతు సంఘాలతో చర్చించి బీటీ విత్తనాల ధరను రూ.1860 నుంచి రూ.600కి తెచ్చిన‌ తమ నిర్ణయం రైతులకు రూ.60,000 కోట్లకు పైగా ఆదా చేసిందని వెల్లడించారు.

రాజ్యాంగ పరిరక్షణకు ఐక్య పోరాటమే మార్గం
సీపీఐ (CPI) ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) మాట్లాడుతూ.. దేశాన్ని కాపాడే శక్తి కాంగ్రెస్, కమ్యూనిస్టులకే ఉందన్నారు. మోడీ (Modi) నాగపూర్‌ (Nagpur) లోని ఆర్ఎస్ఎస్ (RSS) కార్యాలయానికి వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తూ, స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమీ లేదని ప్రశ్నించారు. ఇండియా అలయన్స్‌లోని పార్టీలు కలసి బీజేపీ దుర్వినియోగాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ఉన్నందువల్లే వివిధ వర్గాలు కలసి జీవించగలుగుతున్నాయని, డాక్టర్ అంబేద్కర్ (Dr. Ambedkar) రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment