పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో భారీ ప్రకంపనలు రేగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్లో (TMC) అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్న వేళ, పార్టీ సీనియర్ నేత కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. “మీకు మీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) కావాలా? లేక నాలాంటి నమ్మకమైన నాయకులు (Loyal Leaders) కావాలా?” అంటూ మమతా బెనర్జీకి ఆయన బహిరంగంగానే అల్టిమేటం జారీ చేశారు. పార్టీకి సంవత్సరాలుగా సేవలందిస్తున్న నేతలను పక్కనబెట్టి కుటుంబ రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించిన కల్యాణ్ బెనర్జీ, అభిషేక్ బెనర్జీ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో టీఎంసీలో కొత్త రాజకీయ సంక్షోభం (Political Crisis) మొదలైందనే చర్చ జోరుగా సాగుతోంది.
ఇక అభిషేక్ బెనర్జీపై ఉన్న ఫోర్జరీ కేసులో (Forgery Case) లాయర్గా తప్పుకుంటున్నట్లు ప్రకటించడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. తనపై నమ్మకం లేకుండానే కేసు నుంచి తనను తప్పించారని, పెద్దలను గౌరవించడం అభిషేక్కు తెలియదంటూ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు రాజీనామాలు చేయడం, తిరుగుబాటు వర్గాలతో చేతులు కలపడం టీఎంసీకి పెద్ద దెబ్బగా మారింది. వరుస పరిణామాలతో మమతా బెనర్జీ నాయకత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, ఈ రాజకీయ తుఫాను ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది.








