మాదాపూర్‌లో గంజాయి కలకలం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే లక్ష్యం

మాదాపూర్‌లో గంజాయి కలకలం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే లక్ష్యం

Summarize with AI

మాదాపూర్ ప్రాంతంలో గంజాయి మరియు హాష్ ఆయిల్ అక్రమ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను లక్ష్యంగా పెట్టుకుని గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ అదుపులోకి తీసుకుంది.

సిద్ధిఖీనగర్‌లో దాడి
మాదాపూర్ సిద్ధిఖీనగర్‌ (Siddique Nagar) ప్రాంతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుకు గంజాయి విక్రయిస్తుండగా, అధికారులు తనిఖీ చేసి ఓ వ్య‌క్తిని అరెస్టు చేశారు. దర్యాప్తులో అతని నుంచి 830 గ్రాముల గంజాయి మరియు 14 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఐటీ ప్రొఫెషనల్స్ టార్గెట్‌గా కొంద‌రు అక్ర‌మార్కులు ఈ వ్యాపారం చేస్తున్నార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment