లోకల్ ఛానల్‌లో ‘గేమ్ ఛేంజర్’ ప్రసారం.. నిర్మాత ఆగ్ర‌హం

లోకల్ ఛానల్‌లో 'గేమ్ ఛేంజర్' ప్రసారం.. నిర్మాత ఆగ్ర‌హం

Summarize with AI

రామ్‌చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా ‘గేమ్ ఛేంజర్’ విడుదలైన వారం రోజులు కూడా కాకముందే ఓ లోకల్ ఛానల్‌లో ప్రసారం చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన స్క్రీన్ షాట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ నిర్మాత ఆగ్రహం
ఈ సంఘటనపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత శ్రీ‌నివాస్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలంటే నాలుగేళ్లు ఎంతో మంది శ్రమిస్తారు. ఆ సినిమా వెనుక వేలాది మంది కష్టపడతారు” అని వ్యాఖ్యానించారు. ఈ ఘటన టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పైర‌సీపై మ‌ళ్లీ చ‌ర్చ మొద‌లైంది.

సమస్యపై చర్చ
సినిమా విడుదల తర్వాత కొన్ని రోజుల్లోనే ఇలాంటి ఘటనలు జరగడం టాలీవుడ్‌లోనే కాదు, సినిమా రంగం మొత్తానికి పెద్ద సమస్యగా మారింది. దీని వల్ల నిర్మాతలకు తీవ్ర నష్టం జరుగుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment