కాకినాడలోని బాలాజీ ఎక్స్పోర్ట్స్లో సోమవారం భయంకరమైన పేలుడు సంభవించింది. స్థానిక వార్పు రోడ్డులో ఉన్న జై బాలాజీ ఎక్స్పోర్ట్స్లో బాణసంచా పార్సిల్ దింపుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో హమాలీలు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే కాకినాడ జీజీహెచ్ (Government General Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బ్లాస్టింగ్ జరిగిన ప్రదేశాన్ని పోలీసు ఉన్నతాధికారులు సందర్శించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన చిన్న చిన్న క్రాకర్స్ పార్శిల్ వచ్చాయని, ఆ మూటను ఒక్కసారిగా కింద పడేయడంతో ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక సమాచారం. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తత రేపగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పేలుడుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాకినాడ బాలాజీ ఎక్స్పోర్ట్స్లో పేలుడు, నలుగురు వ్యక్తులకు గాయాలు
— Telugu Feed (@Telugufeedsite) March 3, 2025
హమాలీలు లోడ్ దింపుతుండగా సంభవించిన పేలుడు
భారీ శబ్దం రావడంతో పరుగులు తీసిన హమాలీలు#Kakinada #Blast #AndhraPradesh pic.twitter.com/h5vgUgXxx9