మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన ప్రకటన చేశారు. తాను పూర్తిగా రాజకీయాలకే గుడ్బై చెప్తున్నట్లుగా ప్రకటించారు. ఐఏఎస్ అధికారిగా సర్వీస్ను వదులుకొని గత ఎన్నికల్లో వైసీపీ తరఫున కర్నూలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల తరువాత నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాతో పాటు రాజకీయాలకే దూరం జరుగుతన్నట్లు వివరించారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధిష్టానికి పంపించారు.
సేవా కార్యక్రమాలపై దృష్టి..
ఇంతియాజ్ తన రాజీనామా లేఖలో పలు అంశాలను స్పష్టం చేశారు. రాజకీయాలు తన లక్ష్యాలకు అనుగుణంగా లేవని భావించి వీటికి వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజల కోసం సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. వ్యక్తిగతంగా ఇతరులతో కలిసి సమాజ సేవకై పలు కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు.