ఉద్యమం తప్పదు.. కూటమి ప్రభుత్వానికి ఏపీజీఈఎఫ్ అల్టిమేటం

ఉద్యమం తప్పదు.. కూటమి ప్రభుత్వానికి ఏపీజీఈఎఫ్ అల్టిమేటం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (APGEF) కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన అల్టిమేటం జారీ చేసింది. ఉద్యోగుల చిరకాల వాంఛలైన పీఆర్సీ (PRC), ఐఆర్ (IR) ప్రకటనలపై ఉగాది పండుగ నాటికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఏపీజీఈఎఫ్ అధ్యక్షుడు హెచ్చరించారు.

9 హామీలు.. ఒక్కటీ అమలు కాలేదు
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా, ఎన్నికల సమయంలో ఇచ్చిన 9 ప్రధాన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 4 డీఏలను (DA) పెండింగ్‌లో పెట్టడంపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు.

ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవే..
రెండేళ్లు గడుస్తున్నా పీఆర్సీ కమిషన్‌ను నియమించకపోవడంపై ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే పీఆర్సీ, ఐఆర్‌పై ప్రకటన చేయాలని డిమాండ్ చేసింది. ఉద్యోగులకు రావాల్సిన సుమారు రూ. 35 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందో స్పష్టత ఇవ్వాలని కోరారు. నిలిపివేసిన 4 డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కార్యాచరణ
ప్రభుత్వం స్పందించని పక్షంలో తమ నిరసనను ఉధృతం చేస్తామని ఏపీజీఈఎఫ్ ప్రకటించింది. తొలుత జిల్లా స్థాయిలో భారీ నిరసన కార్యక్రమాలు చేపడతాం. అనంతరం సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. “ఉద్యోగుల సహనానికి పరీక్ష పెట్టవద్దు. ఉగాది లోపు శుభవార్త వినాలని కోరుకుంటున్నాం, లేని పక్షంలో కార్యాచరణ తప్పదు” అని ఏపీజీఈఎఫ్ అధ్యక్షులు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment