వైసీపీకి చెందిన దళిత సర్పంచి కొర్లకుంట నాగమల్లేశ్వర రావుపై జరిగిన దాడిని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని, టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని రక్తమోడుతోందని ఆయన ఆరోపించారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, రాష్ట్రంలో మాఫియా తరహా పాలన, దుర్మార్గపు రాజకీయాలు కొనసాగుతున్నాయని జగన్ ట్వీట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగమల్లేశ్వర రావు కుటుంబం మొదటి నుంచి వైసీపీతో ఉండడం, ప్రజల్లో మంచి గుర్తింపు కలిగి ఉండడం టీడీపీ నాయకులకు కంటగింపుగా మారిందని, ఈ దాడి రాజకీయ కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు.
స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలు ఈ దాడిని పథకం ప్రకారం చేపట్టారని జగన్ ఆరోపించారు. నాగమల్లేశ్వర రావును పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా ఆయన వెనక్కి తగ్గకపోవడంతో, వైసీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక ఈ దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన వీడియోలో కనిపించే దృశ్యాలు దాడి యొక్క హీనతను, అన్యాయాన్ని స్పష్టం చేస్తున్నాయని జగన్ తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు, అరెస్టులు, దాడులు కొనసాగుతున్నాయని, ఇవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో స్థానిక నాయకులు ఇవన్నీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనలు రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేని పరిస్థితిని సూచిస్తున్నాయని ఆయన అన్నారు.
ఈ దాడి ఘటన రాష్ట్రంలో చట్ట వ్యవస్థ, రాజ్యాంగం ఉల్లంఘనకు నిదర్శనమని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం మాఫియా తరహాలో నడుస్తోందని, రాజకీయ నాయకులకు, సామాన్య పౌరులకు రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్బుక్, పొలిటికల్ గవర్నన్స్లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు. గుంటూరు… pic.twitter.com/VfNxKZRUlz
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2025








ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు