అమరావతి (Amaravati) ప్రాంతంలోని ఉండవల్లిలో రైతులపై(Undavalli Farmers) జరుగుతున్న బలవంతపు భూసేకరణ (Land Acquisition) చర్యలను వెంటనే నిలిపివేయాలని వైసీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం, రైతులను పోలీసుల(Police) సహాయంతో భూముల(Lands) నుంచి బలవంతంగా లాక్కొని వెళ్లడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఉండవల్లిలో జరిగిన బలవంతపు భూ సేకరణపై జగన్ ట్వీట్ చేశారు.
ఉండవల్లిలో తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ, వారి అభ్యంతరాలను వినకుండా అధికారులు పోలీసులను మోహరించి బుల్డోజర్లతో (Bulldozers) పొలాల్లోకి వెళ్లి పంటలను ధ్వంసం చేశారని జగన్ ఆరోపించారు. రైతులను వారి పొలాల నుంచి బలవంతంగా ఈడ్చిపారేసి భయభ్రాంతులకు గురిచేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
బాధితుల్లో ఎక్కువ మంది సన్న, చిన్నకారు రైతులేనని, వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే జీవనాధారమని జగన్ పేర్కొన్నారు. ఆ భూమితోనే పిల్లల చదువులు(Children Education), కుటుంబ పోషణ (Family Livelihood) సాగుతోందని గుర్తుచేశారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతును నొక్కుతోందని ఆరోపించారు.
పంటలు ధ్వంసం (Crops Destroyed) కావడంతో రైతులు పెట్టిన పెట్టుబడికి ఎవరు బాధ్యత వహిస్తారని, నష్టపోయిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారని జగన్ ప్రశ్నించారు. రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే హక్కు ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని నిలదీశారు.
గతంలోనే రాజధాని పేరుతో వేల ఎకరాల భూములను సేకరించిన ప్రభుత్వం, అప్పట్లో భూములు ఇచ్చిన రైతుల సమస్యలను కూడా పూర్తిగా పరిష్కరించలేదని జగన్ అన్నారు. అలాంటప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతోందని ప్రశ్నించారు. రైతుల అంగీకారం లేకుండా భూములపై ప్రణాళికలు రూపొందించడం, అవార్డులు ప్రకటించినట్లు చెప్పడం, పూర్తి వివరాలు తెలియజేయకుండా ఏకపక్షంగా భూసేకరణ (Land Acquisition) చేపట్టడం న్యాయసమ్మతం కాదని పేర్కొన్నారు.
ఉండవల్లి ప్రాంతంలోని భూములు విజయవాడ (Vijayawada) నగరానికి సమీపంలో, చెన్నై–కోల్కత (Chennai–Kolkata) జాతీయ రహదారి పక్కన, తాడేపల్లి (Tadepalli) పట్టణాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములని జగన్ పేర్కొన్నారు. మార్కెట్ విలువకు తగిన పరిహారం ఇవ్వకుండా, ప్రభుత్వం నిర్ణయించిన విలువలతో భూములను స్వాధీనం చేసుకోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల భూములను భవిష్యత్తులో ఎవరికి కేటాయించాలనుకుంటున్నారని కూడా ప్రశ్నించారు.
రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే తీసుకోవచ్చని, కానీ పోలీసులను వినియోగించి, పంటలను ధ్వంసం చేసి, రైతులను బలవంతంగా తొలగించి భూములు స్వాధీనం చేసుకోవడం పూర్తిగా తప్పని జగన్ స్పష్టం చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) వెంటనే ఉండవల్లిలో జరుగుతున్న బలవంతపు భూసేకరణ చర్యలను నిలిపివేయాలని, ధ్వంసమైన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలని, రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవద్దని ఆయన డిమాండ్ చేశారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం వైసీపీ(YSRCP) అండగా నిలుస్తుందని జగన్ తెలిపారు.
అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో… pic.twitter.com/rA7pC3hXRS
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 11, 2026








