దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పేపర్ లీకేజీల వ్యవహారం, విద్యా వ్యవస్థలో సంస్కరణల డిమాండ్తో గత 26 రోజులుగా కొనసాగుతున్న సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష ముగిసింది. కేంద్ర ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ లభించడంతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో పాటు వాంగ్చుక్ భార్య గీతాంజలి అంగ్మో సమక్షంలో ఆయన నిమ్మరసం తాగి దీక్షను విరమించారు.
శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులు, యువతపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోమని, పేపర్ లీకేజీల కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇవ్వడంతో వాంగ్చుక్ దీక్ష విరమించారు.
విద్యావ్యవస్థలోని లోపాలు, పేపర్ లీకేజీల నిరోధక చర్యలు, విద్యారంగ సంస్కరణలపై పార్లమెంట్లో సుదీర్ఘంగా చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. భవిష్యత్తులో ఎలాంటి పేపర్ లీక్ ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు, కేసుల త్వరితగతిన విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని సైతం హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రాతపూర్వక హామీ ఇవ్వడం పట్ల సోనం వాంగ్చుక్ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు, వాంగ్చుక్ దీక్ష విరమణను కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు స్వాగతించారు. అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగేది లేదని సిజెపి నాయకుడు అభిజిత్ స్పష్టం చేశారు.
విద్యార్థుల నిరసనలను పూర్తిగా విరమింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా నేడు మధ్యాహ్నం 12 గంటలకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు కీలక చర్చలు జరపనున్నారు.









‘చిన్నోడు.. పెద్దోడు’.. టీడీపీ మీడియాపై అంబటి సెటైర్లు