ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్ జట్టుకు భారత ఓపెనర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుత శతకంతో ఇన్నింగ్స్ను ముందుండి నడిపించగా, ఇషాన్ కిషన్ కూడా విధ్వంసకర బ్యాటింగ్తో బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వీరిద్దరి దూకుడుతో భారత జట్టు స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
శుభ్మన్ గిల్ కేవలం 98 బంతుల్లో 138 పరుగులతో అజేయంగా నిలవగా, ఇషాన్ కిషన్ 79 బంతుల్లోనే 125 పరుగులు చేసి ఆఫ్ఘన్ బౌలింగ్ను చిత్తు చేశాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షంతో స్టేడియంలో అభిమానులకు పూర్తి వినోదాన్ని అందించిన ఈ జోడీ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వారి వీరోచిత ఇన్నింగ్స్లతో టీమిండియా 37.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 327 పరుగుల భారీ స్కోరు నమోదు చేసి మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది.








‘బందర్ రోడ్డుపై తేల్చుకుందాం’.. సాయికృష్ణ ఫ్యామిలీ ఓపెన్ ఛాలెంజ్