పోలవరం ప్రాజెక్టు నిర్మాణ (Polavaram Project Construction) ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్యాప్-2 (Gap-2) వద్ద డీవాటరింగ్ (Dewatering) కోసం తవ్విన కెనాల్లో (Canal) ఇద్దరు గల్లంతయ్యారు. వీరిలో సీనియర్ మెకానికల్ ఇంజనీర్ రవికాంత్ (Ravikanth) మృతదేహం లభించగా, డోజర్ ఆపరేటర్ నాగేశ్వరరావు (Nageswara Rao) కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
నాలుగు రోజుల క్రితం గ్యాప్-2 వద్ద కెనాల్ తవ్వే పనులు జరుగుతుండగా ఓ ప్రొక్లైన్ (Excavator) నీటిలోకి జారిపోయింది. దానిని వెలికితీసే పనులు చేపట్టిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
డీవాటరింగ్ కోసం తవ్విన కెనాల్లో డోజర్ ఆపరేటర్ నాగేశ్వరరావు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయినట్లు తెలుస్తోంది. అతడిని రక్షించేందుకు సీనియర్ మెకానికల్ ఇంజనీర్ రవికాంత్ చేయి అందించే ప్రయత్నం చేయగా.. ఆయన కూడా నీటిలో పడి గల్లంతయ్యారు.
గల్లంతైన రవికాంత్ నర్సీపట్నానికి (Narsipatnam) చెందినవారు కాగా, నాగేశ్వరరావు తూర్పుగోదావరి జిల్లా (East Godavari) సీతానగరం ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.
సమాచారం అందుకున్న ప్రాజెక్టు అధికారులు, స్థానికులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇంజనీర్ రవికాంత్ మృతదేహం లభించింది. గల్లంతైన నాగేశ్వరరావు ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.








