మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటం గెలిచిన మణిక విశ్వకర్మ

మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటం గెలిచిన మణిక విశ్వకర్మ

మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని రాజస్థాన్‌కు చెందిన యువతి మణిక విశ్వకర్మ గెలుచుకున్నారు. గత ఏడాది విజేత రియా సింఘా ఆమెకు కిరీటం తొడిగారు. తాజాగా జైపూర్‌లో జరిగిన ఈ అందాల పోటీలో మణిక విజయం సాధించారు. ఈ ఏడాది థాయ్‌లాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశం తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు.

మణిక విశ్వకర్మ గురించి..

స్థలం: మణిక రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు చెందినవారు, ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నారు.

విద్య: ఆమె పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు.

ఎన్‌సీసీ: ఆమె ఒక ఎన్‌సీసీ క్యాడెట్ కూడా.

సేవా కార్యక్రమాలు: మణిక న్యూరోనోవా అనే సంస్థను స్థాపించి, ఏడీహెచ్‌డీ (ADHD) వంటి న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడేవారికి సహాయం అందిస్తున్నారు.

మణిక తన అందం, ప్రతిభ, సేవా భావనతో మిస్ యూనివర్స్ వేదికపై భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తారని ఆశిద్దాం.

Join WhatsApp

Join Now

Leave a Comment