తెలంగాణ రాష్ట్రం ఇటీవల కులగణన కార్యక్రమం చేపట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో సీఎం రేవంత్రెడ్డి సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అధికారులు రూపొందించిన నివేదికపై మంత్రిమండలిలో ఇంకా చర్చించకుండానే వివరాలు బయటకు వెల్లడించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎస్సీ నివేదిక వివరాలను కేబినెట్ సబ్ కమిటీ గోప్యంగా ఉంచుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం అర్ధాంతరంగా మీడియా సమావేశాన్ని కూడా మంత్రులు రద్దు చేసుకున్నారు. కేబినెట్ ముందుకు వచ్చాకే ఎస్సీ కమిషన్ నివేదిక వివరాలు వెల్లడించాలని నిర్ణయం తీసుకున్నారు.
కులగణన నివేదిక వివరాల వెల్లడిపై సీఎం సీరియస్?








