ఐసీసీ(ICC) మహిళల టీ20 (Women’s T20) ప్రపంచకప్ 2026లో (World Cup 2026) భారత మహిళల జట్టు చరిత్రాత్మక ప్రదర్శనతో రికార్డు పుస్తకాల్లో చోటు దక్కించుకుంది. లీడ్స్లోని హెడింగ్లీ (Headingley) మైదానంలో నెదర్లాండ్స్తో (Netherlands) జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సారథ్యంలోని భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో 200కు పైగా స్కోరు చేసిన రెండో జట్టుగా నిలిచింది. ఇదే సమయంలో మహిళల టీ20 ప్రపంచకప్లలో భారత్(India) నమోదు చేసిన అత్యధిక స్కోరుగా కూడా ఈ ఇన్నింగ్స్ నిలిచింది. ఇంగ్లండ్ తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన జట్టుగా టీమిండియా గుర్తింపు పొందింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధానా(Smriti Mandhana), షెఫాలీ వర్మ (Shafali Verma) అద్భుత ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్కు 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఈ జోడీ నెదర్లాండ్స్ బౌలర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. మంధానా 74 పరుగులు, షెఫాలీ 55 పరుగులతో మెరవగా, చివర్లో రిచా ఘోష్, దీప్తి శర్మ మెరుపు ఇన్నింగ్స్లతో స్కోరును 209కు చేర్చారు. అనంతరం బౌలింగ్లోనూ చెలరేగిన భారత జట్టు నెదర్లాండ్స్ను కట్టడి చేసి 95 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచకప్లో భారత్ టైటిల్ (India Title) ఫేవరెట్గా మరింత బలమైన సంకేతాలు పంపింది.








