విద్యార్థుల ఉద్యమాన్ని (Students Movement) ప్రభుత్వం (Government) తేలికగా తీసుకోవద్దని, అవసరమైతే మరింత పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని సీజేపీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే (Abhijit Deepke) కేంద్ర ప్రభుత్వాన్ని (Central Government) హెచ్చరించారు. విద్యార్థులపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
విద్యార్థుల ఆగ్రహం ఇంకా సద్దుమణగలేదని, ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను (Dharmendra Pradhan) పదవి నుంచి తప్పించే స్థాయిలో ఉద్యమం సాగించామని, అవసరమైతే ప్రస్తుత మోడీ ప్రభుత్వాన్ని (Modi Government) కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మార్చే స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్తామని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీపై (Narendra Modi) కూడా అభిజిత్ దిప్కే విమర్శలు గుప్పించారు. మోడీ వీడియోలు చేయడంలో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని, ఆయన ప్రధాని పదవిని వదిలి ఇన్ఫ్లుయెన్సర్గా(Influencer) మారవచ్చని వ్యాఖ్యానించారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పోలీసులు అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
“విద్యార్థులేమైనా ఉగ్రవాదులా (Terrorists)? విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తు” అంటూ ప్రభుత్వ చర్యలను ప్రశ్నించారు. విద్యార్థులపై వేధింపులు తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే నిరసనకారులపై పెల్లెట్ తుపాకులు ఉపయోగించేందుకు అనుమతి ఇచ్చిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వం ప్రజల, విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోకపోతే యువతే ఈ ప్రభుత్వాన్ని మార్చే పరిస్థితి వస్తుందని అభిజిత్ దీప్కే హెచ్చరించారు.








