Telugu Feed

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లాయర్ దాడి యత్నం! దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అమానుష ఘటన చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించడం కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం సృష్టించింది. సీజేఐ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ముందు కేసుల విచారణ జరుగుతున్న సమయంలో, కిషోర్ రాకేష్ అనే వృద్ధ న్యాయవాది వేదిక దగ్గరకు దూసుకెళ్లి, ప్రధాన న్యాయమూర్తిపైకి షూ విసిరేందుకు ప్రయత్నించాడు. అయితే, అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి ఆయన్ను అడ్డుకున్నారు. దాడికి యత్నించిన ఆ న్యాయవాది "సనాతన్ కా అప్మాన్ నహీ సహేంగే" (సనాతన్‌ను అవమానించడాన్ని మేము సహించం) అని గట్టిగా అరుస్తూ కనిపించాడు. భద్రతా సిబ్బంది ఆయన్ని కోర్టు గది నుంచి బయటకు లాక్కెళ్లిపోయారు. వివాదానికి కారణమైన సీజేఐ వ్యాఖ్యలు ఈ దాడి యత్నానికి ప్రధాన కారణం.. ఖజురహోలోని విష్ణువు విగ్రహం కేసు విచారణ సందర్భంగా సీజేఐ బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలే. ఏడు అడుగుల ఎత్తైన విష్ణువు విగ్రహాన్ని మళ్లీ తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సీజేఐ వ్యాఖ్యలు: "మీరు మిమ్మల్ని విష్ణువు ఆరాధకుడిగా పిలుచుకుంటే... కొంచెం ప్రార్థన చేసి ధ్యానం చేయండి. వెళ్లి భగవంతుడినే దీనిపై చర్యలు తీసుకోమని అడగండి," అంటూ వ్యాఖ్యానించారు. "ఖజురహో ఒక పురావస్తు ప్రదేశం. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కిందకు వస్తుంది. వారి అనుమతి లేకుండా దీనిలో ఎలాంటి మార్పు సాధ్యం కాదు, క్షమించండి" అని గవాయ్ స్పష్టం చేశారు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ నిరసన సీజేఐ చేసిన ఈ వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయని పలువురు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాది సత్యం సింగ్ రాజ్‌పుత్ సీజేఐకి బహిరంగ లేఖ రాస్తూ, వ్యాఖ్యలను పునః పరిశీలించాలని లేదా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరో న్యాయవాది వినీత్ జిందాల్ రాష్ట్రపతికి లేఖ రాసి, హిందూ భావాలకు వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే, దాడి యత్నం జరిగినప్పటికీ సీజేఐ గవాయ్ ఏమాత్రం ఆందోళన చెందలేదు. ఇలాంటి దాడులు తనను ప్రభావితం చేయవని వ్యాఖ్యానించి, యథావిధిగా విచారణను కొనసాగించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నం!

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌ (B.R. Gavai)పై ఓ న్యాయవాది (Lawyer) దాడికి యత్నించడం కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం ...

తెలంగాణ సర్కార్ కి సుప్రీంకోర్టులో ఊరట!

తెలంగాణ సర్కార్ కి సుప్రీంకోర్టులో ఊరట!

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ‘హైకోర్టులో ఉన్నప్పుడు ...

ఎవరెస్ట్‌పై భారీ మంచు తుఫాన్‌.. దిగ్బంధంలో 1000 మంది ట్రెక్కర్స్‌

ఎవరెస్ట్‌పై మంచు తుఫాన్‌.. దిగ్బంధంలో 1000 మంది ట్రెక్కర్స్‌ (Video)

భారీ మంచు తుఫాన్ (Snow Storm) ఒక్క‌సారిగా విరుచుకుప‌డింది. వందలాది మంది పర్వతారోహకులు ఎవ‌రెస్ట్ ప‌ర్వ‌తం (Everest Mountain)పై చిక్కుకుపోయారు. ప‌ర్వ‌తారోహ‌కుల కోసం టిబెట్‌ పర్వత ప్రాంతంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. చైనా ...

క్రికెట్‌లో మనదే అగ్రస్థానం!

క్రికెట్‌లో మనదే అగ్రస్థానం!

క్రికెట్‌లో భారత్ (టీమిండియా) (Team India) తిరుగులేని డామినేషన్ చూపిస్తోంది. పురుషులు, మహిళల జట్లు రెండూ వరుస విజయాలతో దూసుకుపోతుండగా, దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) మాత్రం ఆ ఒత్తిడిని భరించలేక ఓటములతో ...

టీడీపీని కుదిపేస్తున్న 'క‌ల్తీ లిక్క‌ర్ కేసు డైరీ'

టీడీపీని కుదిపేస్తున్న ‘క‌ల్తీ లిక్క‌ర్ కేసు డైరీ’

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో నకిలీ మద్యం (Fake Liquor) తయారీ కేసు సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని గతంలో “లిక్కర్ స్కాం” (Liquor Scam) అంటూ విమర్శించిన టీడీపీ నేతలే ఇప్పుడు అక్రమ ...

అక్కినేని నాగార్జున 100వ సినిమా: ‘లాటరీ కింగ్’

నాగార్జున 100వ సినిమా: ‘లాటరీ కింగ్’

మన్మధుడు నాగార్జున (Nagarjuna) 100వ సినిమాపై తాజా అప్‌డేట్‌! ఈ మైల్‌స్టోన్ ప్రాజెక్టుకు ‘లాటరీ కింగ్’ (Lottery King)అనే ఆసక్తికరమైన టైటిల్‌(Title)ను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘కుబేర’, ‘కూలీ’ వంటి ...

“ఇది ప్రభుత్వం చేసిన హత్యే” - మన్యం విషాదంపై వైఎస్ జగన్ ఆవేదన

“ఇది ప్రభుత్వం చేసిన హత్యే” – మన్యం విషాదంపై వైఎస్ జగన్ ఆవేదన

పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన బాలికలు పచ్చకామెర్లతో మరణించటం పట్ల వైఎస్ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని మండిపడ్డారు. కురుపాం బాలికల గిరిజన గురుకుల ...

Naidu cuts off 80% of drivers: 12 Lakh Cheated

Naidu cuts off 80% of drivers: 12 Lakh Cheated

Naidu promised during the elections to give Rs. 15,000 annually to every badge-holding auto driver. In Andhra Pradesh, there are about 15 lakh such ...

దసరా కానుక కాదు..దగా మోసం - ఆటో కార్మిక సంఘం ఫైర్‌

దసరా కానుక కాదు..దగా మోసం – ఆటో కార్మిక సంఘం ఫైర్‌

ఆటో కార్మికులకు (Auto Workers) దసరా కానుక (Dasara Gift) పేరుతో జరిగిన‌ సభ మోసపూరిత సభ అంటూ ఐఎఫ్‌టీయూ (IFTU) ఆధ్వర్యంలోని ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ ధ్వజమెత్తింది. ...

‘ఆటో డ్రైవర్ సేవలో’ ప్రారంభం.. సీఎం కీల‌క వ్యాఖ్య‌లు

‘ఆటో డ్రైవర్ సేవలో’ ప్రారంభం.. సీఎం కీల‌క వ్యాఖ్య‌లు

గ‌త ప్ర‌భుత్వంలో వైఎస్సార్ వాహ‌న మిత్ర పేరుతో ఆటోడ్రైవ‌ర్ల కోసం ఏర్పాటు చేసిన ప‌థ‌కం పేరు మార్చి ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రారంభించారు. ఈ ...