ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురి ప‌రిస్థితి విష‌మం

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురి ప‌రిస్థితి విష‌మం

Summarize with AI

అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం కొక్కిరేపల్లి జాతీయ రహదారి వద్ద ఆదివారం ఉదయం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. రహదారిపై వేగంగా దూసుకువచ్చిన టాటా మ్యాజిక్ వాహనం ఒక ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన వారిని మొదట య‌లమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే, పరిస్థితి విషమించడంతో ఎనిమిది మందిని అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి, అలాగే కొందరిని విశాఖ కింగ్ జార్జ్‌ ఆసుపత్రికి తరలించారు.

దురదృష్టవశాత్తూ మార్గమధ్యంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మిగతా ఆరుగురి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదం కారణంగా కొంతసేపు రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికులు గాయపడిన వారిని రక్షించేందుకు సహాయ చర్యల్లో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment