గత పదిహేను రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాడ లేదు. ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. తన శాఖపరమైన వ్యవహారాల్లోనూ యాక్టివ్గా లేరు. అసలు కెమెరాలకే చిక్కలేదు. దీంతో పవన్కు ఏమైందనే ఆందోళన వ్యక్తమైంది. ఈనెల 6వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశానికి గైర్హాజరయ్యారు. నిన్న జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో ఆందోళన తీవ్రమైంది.. పవన్ ఎక్కడా అనే క్వశ్చన్ రైజ్ అయ్యింది.
నిన్న జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి గైర్హాజరైన పవన్, అనూహ్యంగా ఇవాళ కాషాయం కట్టి దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు బయల్దేరారు. మూడు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలను డిప్యూటీ సీఎం సందర్శించనున్నట్లుగా తెలుస్తోంది. తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పవన్ అనూహ్య పర్యటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దీంతో సరికొత్త అంశం ఒకటి తెరపైకి వచ్చింది. రెండు కీలక సమావేశాలకు గైర్హాజరుపై పవన్ కళ్యాణ్తో ఫోన్లో మాట్లాడేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నించగా, డిప్యూటీ సీఎం స్పందించలేదని తెలుస్తోంది. ఫోన్లో దొరకడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్తో చెప్పగా, నడుం నొప్పితో బాధపడుతున్నారని సీఎంకు సమాధానం ఇచ్చారని సమాచారం. నిన్న నడుము నొప్పితో రెస్ట్ తీసుకుంటున్న పవన్.. ఇవాళ కేరళ పర్యటనకు బయల్దేరడంతో కూటమిలో కయ్యం మొదలైందని, అది తారాస్థాయికి చేరిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
కూటమి పార్టీల మధ్య విభేదాలు తలెత్తడంతోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ మధ్య తారాస్థాయికి చేరడంతో ఇద్దరూ ఎడ మొహం, పెడమొహంగా ఉంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే రెండు కీలక సమావేశాలకు పవన్ హాజరుకాలేదన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ విభేదాలకు కారణంగా లోకేశ్కు డిప్యూటీ సీఎం పదవి ప్రతిపాదనే అని ఆరోపణలు వస్తున్నాయి.
విభేదాల అంశాన్ని తెరపైకి తెచ్చి, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. సూపర్ సిక్స్ హామీలను మరుగునేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ వాదనలు, ఆరోపణలకు పులిస్టాప్ పెడతారా..? లేక కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి.