ఫ్యాన్స్ ఖర్చు చేసిన ప్రతి రూపాయికి న్యాయం చేస్తా..- హార్దిక్

ఫ్యాన్స్ ఖర్చు చేసిన ప్రతి రూపాయికి న్యాయం చేస్తా..- హార్దిక్

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఆట ద్వారా అభిమానులను ఎప్పుడూ ఎంటర్‌టైన్ చేయాలనే లక్ష్యంతో ఉంటానని తెలిపారు. “ఫ్యాన్స్ టికెట్ కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను” అని హార్దిక్ పేర్కొన్నారు.

“ప్రతి క్షణం ఆట కోసమే పరితపిస్తా. క్రికెట్ నా జీవితం. ఇది నాకు ఎన్నో ఇచ్చింది. నా తొలి ప్రేమ కూడా క్రికెటే. తొలి ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే” అని హార్దిక్ భావోద్వేగంగా వెల్లడించారు. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో హార్దిక్ అద్భుతమైన ఆటతో 53 రన్స్ బాదాడు, తన ఆటతో అభిమానులను అలరించాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment