అనకాపల్లిలోని ఒక జిమ్కు ఏకంగా కోటి రూపాయల కరెంట్ బిల్లు రావడం సంచలనం సృష్టించింది. ప్రతీ నెల 18,000 నుంచి 20,000 రూపాయల బిల్లుతో సాగుతున్న జగన్ వెల్నెస్ అండ్ ఫిట్నెస్ జిమ్కు ఈ నెల బిల్ ఏకంగా రూ. 1 కోటి 15,000 వచ్చిందని నిర్వాహకుడు తెలిపారు. కరెంట్ బిల్లు చూసి షాక్కు గురైన నిర్వాహకుడు వెంటనే అధికారులను సంప్రదించగా, ఈ విషయంపై మీడియాతో మాట్లాడవద్దని వారిని హెచ్చరించడం గమనార్హం.
అధికారుల బెదిరింపులపై ప్రశ్నల జల్లు
విద్యుత్ శాఖ అధికారి చేసిన తప్పిదమే కారణమని నిర్వాహకుడు భావిస్తుండగా, బిల్లుపై మాట్లాడవద్దంటూ వారిని బెదిరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “సాధారణ వ్యక్తులు ఈ విధమైన అన్యాయాన్ని ఎలా భరించగలరు?” అని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంతో ప్రజలు విద్యుత్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.