పిఠాపురంలో అమానుష ఘటన.. 24 గంటల పాటు బెంచ్ మీద‌నే మృతదేహం

పిఠాపురంలో అమానుష ఘటన.. 24 గంటల పాటు బెంచ్ మీద‌నే మృతదేహం

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గానికి ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. అది ఎలా అంటే సినిమా స్టార్‌, జ‌న‌సేన చీఫ్‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌ట‌మే. అలాంటి పిఠాపురంలో అమాన‌వీయ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ప‌ట్ట‌ణంలోని రాజా రామ్మోహన్ రాయ్ పార్కులో మంగళవారం ఒక వ్యక్తి మృతి చెందాడు. అయితే, భయంకరమైన విషయం ఏమిటంటే, ఆ మృతదేహం బుధవారం వరకు అక్కడే పడి ఉండటమే. స్థానికులు, కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. దాదాపు 24 గంటల పాటు ఆ మృతదేహం అలాగే ఉన్నందున పరిసర ప్రాంతమంతా దుర్వాసన వ్యాపించింది.

ఈ దృశ్యం చూసిన స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మానవతా విలువలు రోజుకో రోజుకీ నశిస్తున్నాయని వారు అన్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment