టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసు రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం కెప్టెన్గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఫామ్పై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఐపీఎల్లో(IPL) అద్భుత ప్రదర్శనలతో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) పేరు బలంగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ రేసులోకి కేరళ స్టార్ సంజు శాంసన్ (Sanju Samson) కూడా ఎంట్రీ ఇవ్వడంతో చర్చ మరింత హాట్టాపిక్గా మారింది. ఐపీఎల్ 2026లో చెన్నై జట్టుకు (Chennai Team) ఆడుతున్న సంజు వరుసగా భారీ ఇన్నింగ్స్లు ఆడుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా కీలక మ్యాచ్ల్లో బాధ్యతాయుతమైన బ్యాటింగ్తో తన విలువను నిరూపిస్తున్నాడు.
గతంలో రాజస్థాన్ జట్టును (Rajasthan Team) ఐపీఎల్ ఫైనల్కు (IPL Final) తీసుకెళ్లిన కెప్టెన్సీ అనుభవం సంజుకు పెద్ద ప్లస్గా మారింది. ప్రశాంత స్వభావం, ఒత్తిడిలోనూ మ్యాచ్ను చక్కగా నడిపించే తీరు సెలెక్టర్లను ఆకట్టుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు టీ20 ఫార్మాట్లో అతడి దూకుడు బ్యాటింగ్ కూడా జట్టుకు అదనపు బలం అవుతుందని భావిస్తున్నారు. భారత జట్టులో వరుస అవకాశాలు అందుకుంటూ తన స్థానాన్ని బలపరుచుకున్న సంజు.. భవిష్యత్ కెప్టెన్గా బీసీసీఐ(BCCI) ఆలోచనల్లో ఉన్నాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాటర్గా, కెప్టెన్గా అద్భుత ఫామ్లో కొనసాగుతున్నప్పటికీ.. అతడు చాలా కాలంగా టీ20 అంతర్జాతీయ మ్యాచ్లకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ఎంపిక చేసే జట్టులో ఐపీఎల్ ప్రదర్శన కీలకంగా మారనున్న నేపథ్యంలో.. టీ20 కెప్టెన్సీపై తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ను పూర్తిగా పక్కన పెట్టే ఆలోచన బీసీసీఐకి లేకపోయినా.. భవిష్యత్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.








