పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు ఎన్నికల తొలి విడత పోలింగ్లో ఓటర్లు చరిత్ర సృష్టించారు. స్వాతంత్య్ర అనంతరం ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్లో 92.25 శాతం పోలింగ్ నమోదవగా, తమిళనాడులో 85.03 శాతం ఓటింగ్ రికార్డైంది.
ఈ భారీ ఓటింగ్ ప్రజాస్వామ్యంలో ఓటర్ల చురుకైన భాగస్వామ్యానికి నిదర్శనమని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. బెంగాల్లో మొత్తం 294 స్థానాల్లో తొలి దశగా 152 స్థానాలకు పోలింగ్ జరగగా, మిగిలిన స్థానాలకు ఏప్రిల్ 29న ఎన్నికలు జరగనున్నాయి.
ఇక పశ్చిమ బెంగాల్లో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, ఓటింగ్ శాతం పెరగడం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. ముర్షిదాబాద్లో జరిగిన ఘర్షణలు, అలాగే ఓటర్ల ఆగ్రహం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయా అనే చర్చ సాగుతోంది.
మరోవైపు, తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే, విజయ్ టీవీకే మధ్య త్రిముఖ పోటీ తీవ్రంగా మారింది. ఎండలను సైతం లెక్క చేయకుండా పల్లెలు, పట్టణాల్లో ప్రజలు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఈ పరిణామాలు రెండు రాష్ట్రాల ఎన్నికలను దేశవ్యాప్తంగా హాట్టాపిక్గా మార్చాయి.








