ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) కు తెలంగాణ హైకోర్ట్ (Telangana High Court) నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులో పార్టీ మార్పు అంశంపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది. బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) నేత మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) దానం నాగేందర్పై (Danam Nagender) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ (BRS) పార్టీ తరఫున గెలిచిన నాగేందర్, తరువాత కాంగ్రెస్లో చేరడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరఫు వాదనలు వినిపించాయి. వెంటనే ఆయనపై అనర్హత వేటు వేయాలని కోర్టును కోరారు.
శాసనసభ స్పీకర్ (Assembly Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar), దానం నాగేందర్ పార్టీ (Danam Nagender) మారలేదని.. ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారని ముందుగా తీర్పు ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహేశ్వర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. విచారణలో భాగంగా, స్పీకర్ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy), ఫిరాయింపుల అంశంపై గతంలో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పులను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు పిటిషనర్ తరఫు న్యాయవాది, ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం స్పష్టమైన ఫిరాయింపేనని వాదించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు దానం నాగేందర్కు నోటీసులు జారీ చేసింది.








