నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి (GGH)లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు సెక్యూరిటీ గార్డులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. గత ఐదు నెలలుగా జీతాలు అందకపోవడం, అధికారుల వేధింపులతో విసిగిపోయి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు వారు సూసైడ్ అటెంట్కు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ద్వారా తెలుస్తోంది.
ఐదు నెలలుగా అందని జీతాలు.. అధికారుల వేధింపులు
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న సిబ్బందికి గత ఐదు నెలల నుండి వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతుంటే, అధికారులు కనికరించకపోగా.. తమని ఉద్యోగాల్లోకి చేర్చుకోకుండా వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
లోకేష్, పవన్ కళ్యాణ్లను కలిసినా ఫలితం లేదు
తమ గోడును ఎవరూ పట్టించుకోకపోవడంతో, బాధితులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను కూడా కలిసి విన్నపాన్ని అందజేశామని సెల్ఫీ వీడియోలో వివరించారు. ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వస్తుందని ఆశించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారకపోవడంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యామని వెల్లడించారు.
సెల్ఫీ వీడియో తీసుకుని అఘాయిత్యం
ఆత్మహత్యాయత్నానికి ముందు ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అందులో తమ ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ, జీతాలు లేక బతకలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ముగ్గురూ కలిసి పురుగుల మందు తాగారు. వారి పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే అదే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.









కూటమి ఒక ‘డ్రామా కంపెనీ’.. బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు – జడ శ్రవణ్