ఘోర రోడ్డు ప్రమాదం.. శ్రీ‌వారి భ‌క్తులు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. శ్రీ‌వారి భ‌క్తులు మృతి

చిత్తూరు జిల్లా(Chittoor District)లోని పలమనేరు (Palamaner) సమీప జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కళ్లుమూసేలోగా రహదారి రక్తసిక్తంగా మారిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది.

పోలీసుల వివరాల ప్రకారం, తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి వెళ్తున్న కారు, జాతీయ రహదారి (National Highway)పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారని, బెంగళూరు నగరంలోని (Bengaluru City) రాజాజీనగర్ ప్రాంత నివాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తిరుమల ప్రయాణం దుర్ఘటనగా మారడంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment