పోల‌వ‌రం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంది ఎవ‌రు బాబూ.. అంబ‌టి ప్ర‌శ్న‌

పోల‌వ‌రం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంది ఎవ‌రు బాబూ.. అంబ‌టి ప్ర‌శ్న‌

పోలవ‌రం ప్రాజెక్టుపై చంద్ర‌బాబు చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాలేన‌ని వైసీపీ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు. చంద్రబాబు గతంలో చేసిన అబద్ధాలు, వాటిపై ప్రచారం చూస్తూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును గురించి చేసిన ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని, ప్రాజెక్టులో 72 శాతం పనులు తమ ప్రభుత్వంలో పూర్తయ్యాయని చెప్పడం విడ్డూరంగా ఉంద‌న్నారు. 2014–2019 మధ్య పోలవరం ప్రాజెక్టులో జరిగిన తప్పిదాల వల్లే ఈ సమస్యలు వచ్చాయని అంబటి రాంబాబు తెలిపారు. పోల‌వ‌రం ప్రాజెక్టును చంద్ర‌బాబు ఏటీఎంలా వాడుకున్నార‌ని ప్ర‌ధాని మోడీ ఆరోపించిన విష‌యాన్ని గుర్తుచేశారు.

చంద్రబాబు తీసుకున్న తప్పిదాలు
పోల‌వ‌రం ప్రాజెక్టులో చంద్రబాబు తప్పిదాలు చేసినా, వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. 2013-14 రేట్లపై ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ 2016లో అంగీకరించడం, తదనంతర పరిస్థితి ప్రజలలో అవగాహన కలిగించకుండా తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదు అని విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు
పోలవరం ప్రాజెక్టు పనులకు చంద్రబాబు అవినీతి కారణంగా రూ.900 కోట్ల అదనపు భారం వచ్చిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. 2014-19 మధ్య జరిగిన తప్పిదాలు, గోదావరి ప్రవాహం మళ్లించకుండా డయాఫ్రం వాల్ నిర్మించడం వంటి అంశాలను ప్ర‌స్తావించారు. చంద్రబాబు చేసిన అనాలోచిన నిర్ణ‌యాలే పోల‌వ‌రం ప్రాజెక్టుకు శాపంగా మారాయ‌ని అంబ‌టి రాంబాబు అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment