తెలుగు సినీ పరిశ్రమ (Telugu Cinema Industry)లో మొదలైన రీ-రిలీజ్ (Re-Release) ట్రెండ్ (Trend) ఇప్పుడు భారతీయ సినిమా స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే మరోసారి వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతోంది ‘బాహుబలి’ (‘Baahubali). ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) దర్శకత్వంలో రూపొందిన ఈ బృహత్తర చిత్రం ఈ ఏడాదితో పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, మేకర్స్ ప్రేక్షకులకు ఓ ప్రత్యేక ట్రీట్ ఇవ్వబోతున్నారు.
ఇప్పటికే అధికారికంగా ప్రకటించినట్లుగానే, అక్టోబర్ 31న ‘బాహుబలి – ది ఎపిక్’ (‘Baahubali – The Epic’) పేరుతో ఈ సినిమాను తిరిగి విడుదల చేయనున్నారు. ఈ రీ-రిలీజ్ (Re-release)లో ప్రత్యేకత ఏంటంటే, ‘బాహుబలి: ది బిగినింగ్’ మరియు ‘బాహుబలి: ది కన్క్లూజన్’ అనే రెండు భాగాలను కలిపి ఒకే సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
అయితే, తాజాగా వినిపిస్తున్న షాకింగ్ అప్డేట్ ఏమిటంటే, ఈ సింగిల్ పార్ట్ చిత్రం రన్టైం ఏకంగా 5 గంటల 20 నిమిషాలు ఉండనుందని! ఇదే నిజమైతే, ఇది భారతీయ సినిమా చరిత్రలోనే ఒక రికార్డు స్థాయి ట్రెండ్ సెట్ చేసే ఘటన అవుతుంది. ప్రస్తుతం ఈ రన్టైం విషయమై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉన్నా, అభిమానుల్లో మాత్రం ఈ వార్తతో నూతన ఉత్సాహం నెలకొంది.
మొత్తానికి, అభిమానులు కోరుకున్నట్లుగానే బాహుబలి మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై దర్శనమివ్వబోతుండటంతో, అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ ఆసక్తి కనిపిస్తోంది. మరి ఈ రన్టైం నిజమేనా అన్నది మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాలి.