అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 13వ ఎడిషన్ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ (Women’s ODI World Cup) 2025 షెడ్యూల్(Schedule)ను అధికారికంగా విడుదల చేసింది (Released). భారత్ (India), శ్రీలంక(Sri Lanka)లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నమెంట్ (Mega Tournament) సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరగనుంది. ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు రౌండ్-రాబిన్ ఫార్మాట్లో 28 లీగ్ మ్యాచ్లలో తలపడనున్నాయి.
టోర్నమెంట్ వేదికలు
ఈ టోర్నమెంట్లో మ్యాచ్లు భారత్లోని నాలుగు వేదికలు ఖరారు చేశారు. – ఎం. చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), ఏసీఏ స్టేడియం (గువాహటి), హోల్కర్ స్టేడియం (ఇండోర్), ఏసీఏ-వీడీసీఏ స్టేడియం (విశాఖపట్నం), శ్రీలంకలోని ఆర్. ప్రేమదాస స్టేడియం (కొలంబో)లలో జరగనున్నాయి. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్లో భారత జట్టు సెప్టెంబర్ 30న బెంగళూరులో ఆడనుంది. అయితే భారత్ ఎదుర్కొనే జట్టు ఇంకా నిర్ణయించబడలేదు.
ఆఖరి మ్యాచ్ల షెడ్యూల్
సెమీఫైనల్ 1: అక్టోబర్ 29, 2025 – గువాహటి లేదా కొలంబో
సెమీఫైనల్ 2: అక్టోబర్ 30, 2025 – బెంగళూరు
ఫైనల్: నవంబర్ 2, 2025 – బెంగళూరు లేదా కొలంబో
పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్ లేదా ఫైనల్కు అర్హత సాధిస్తే, భద్రతా కారణాల రీత్యా ఆ మ్యాచ్లు కొలంబోలో జరుగుతాయని ICC స్పష్టం చేసింది. ఈ నిర్ణయం భారత్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల (BCCI, PCB) మధ్య ఒప్పందం ఆధారంగా తీసుకోబడినట్లుగా సమాచారం. అందుకే పాకిస్తాన్ జట్టు తమ అన్ని లీగ్ మ్యాచ్లను కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆడనుంది.
టోర్నమెంట్ ఫార్మాట్, జట్లు
ఈ టోర్నమెంట్లో ఎనిమిది జట్లు – భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ – పాల్గొంటాయి. రౌండ్-రాబిన్ ఫార్మాట్లో ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కసారి తలపడుతుంది. లీగ్ దశ ముగిసిన తర్వాత, టాప్-4 జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఆస్ట్రేలియా జట్టు, 2022లో ఇంగ్లండ్ను ఓడించి ఏడో టైటిల్ను సాధించిన డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది.
భారత్లో వన్డే వరల్డ్ కప్ చరిత్ర
భారత్ గతంలో 1978, 1997, 2013లో ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ను ఆతిథ్యం ఇచ్చింది, ఇది నాల్గోసారి. 2016లో భారత్ మహిళల టీ20 వరల్డ్ కప్ను పురుషుల టోర్నమెంట్తో పాటు నిర్వహించింది. భారత మహిళల జట్టు 2005, 2017లో రెండుసార్లు ఫైనల్కు చేరుకుంది, కానీ ఆస్ట్రేలియా (2005) మరియు ఇంగ్లండ్ (2017) చేతిలో ఓడిపోయింది. ఈసారి సొంత గడ్డపై టైటిల్ సాధించాలనే లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగుతోంది.