ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ (Y. S. Jagan) రాప్తాడు (Raptadu) పర్యటనలో భద్రతా వైఫల్యం (Security Lapse) కనిపించింది. మొదట చెన్నేకొత్తపల్లిలో హెలిప్యాడ్ ఏర్పాటుకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. కుంటిమద్ది-పాపిరెడ్డిపల్లి వద్ద అనుమతి ఇచ్చారు. పాపిరెడ్డిపల్లి (Papireddypalli) లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద భద్రత లోపం కనిపించింది. వైఎస్ జగన్ దిగే హెలిపాడ్ వద్ద సరిపడా బందోబస్తు లేకపోవడంతో జనం హెలికాప్టర్ (Helicopter) వైపునకు దూసుకొచ్చారు. దీంతో జనం తాకిడితో వైఎస్ జగన్ ప్రయాణించిన హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ (Windshield) దెబ్బతిన్నది. హెలికాప్టర్ గ్లాస్ బ్రేక్ అయ్యింది. భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో వీఐపీ (VIP) ని తీసుకెళ్లలేమన్న పైలెట్లు (Pilots). జగన్ దిగిన తర్వాత వెంటనే వెళ్లిపోయారు.
భద్రత లేక హెలికాప్టర్ డ్యామేజీ
పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య (Kuruba Lingamayya) కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో బెంగళూరుకు బయల్దేరారు. హెలిప్యాడ్ వద్ద జనాన్ని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. జనం ఒక్కసారిగా దూసుకురావడంతో హెలిప్యాడ్ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడి ఉన్న పూలు, చెప్పులతో ఆందోళనకరంగా మారిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హెలికాప్టర్ డ్యామేజీ అయిన ఫోటోలు దర్శనమిస్తున్నాయి.
ఉద్దేశపూర్వకంగానేనట
ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ జెడ్ ప్లస్ (Z+ category) కేటగిరిలో ఉన్న వైఎస్ జగన్కు కూటమి ప్రభుత్వం సరైన భద్రత కల్పించడం లేదని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హెలిప్యాడ్ వద్ద సరిపడా బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వల్లే హెలికాప్టర్ డ్యామేజీ అయ్యిందని, జగన్ భద్రత విషయంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వ్యవహరిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయల్దేరిన సమయంలో వైఎస్ జగన్కు కేటాయించిన కార్లు మొరాయించడంతో మాజీ సీఎం వేరే కారులో బయల్దేరారు.
గతంలో గుంటూరు మిర్చియార్డ్ సందర్శన సమయంలోనూ ఒక్క పోలీస్ (Police) కనిపించలేదని, కర్నూలు పర్యటన సమయంలోనూ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైసీపీ ఆరోపిస్తోంది. వైఎస్ జగన్కు సరైన భద్రత కల్పించాలని గవర్నర్ (Governor) సైతం వైసీపీ నేతలు కలిశారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి తగిన భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ చేసిన విషయం తెలిసిందే.
వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం
— Telugu Feed (@Telugufeedsite) April 8, 2025
హెలిప్యాడ్ వద్ద సరిపడా బందోబస్తు ఏర్పాటు చేయని పోలీసులు
జనం తాకిడితో దెబ్బతిన్న హెలికాఫ్టర్ విండ్ షీల్డ్
భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో వీఐపీని తీసుకెళ్లలేమన్న పైలెట్లు
జగన్ దిగిన తర్వాత వెంటనే వెళ్లిపోయిన హెలికాప్టర్ pic.twitter.com/AiBJ4DSKRq