ఆంధ్రప్రదేశ్లో శనివారం అర్ధరాత్రి తెలంగాణ పోలీసుల హడావుడి కలకలం రేపింది. హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు విజయ్ భాస్కర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు ప్రకాశం జిల్లా ఒంగోలు చేరుకున్నారు. అయితే, ఆశ్చర్యకరంగా అతని ఫోన్ లోకేషన్ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఇంటిలో కనిపించడంతో పోలీసులు నేరుగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు.
అయితే, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఇంట్లో లేరు. దీంతో, పని మనిషిని ప్రశ్నించారు. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే అనుచరులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తెలంగాణ పోలీసులను ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
కాగా, విజయ్ భాస్కర్ ఎవరు? ఆయనపై ఉన్న కేసు ఏమిటి? హైదరాబాద్ మాదాపూర్లో ఏం జరిగింది? ఒంగోలు వెళ్లడానికి కారణం ఏంటి? ఎమ్మెల్యే ఇంటి పని మనిషిని ఎందుకు విచారించాల్సి వచ్చింది? అనే ప్రశ్నలపై ప్రస్తుతం ఒంగోలు వన్ టౌన్ పోలీసులు తెలంగాణ పోలీసులతో చర్చలు జరుపుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.