క‌డ‌ప క‌లెక్ట‌రేట్‌లో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. పెట్రోల్‌తో హ‌ల్‌చ‌ల్‌

క‌డ‌ప క‌లెక్ట‌రేట్‌లో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. పెట్రోల్‌తో హ‌ల్‌చ‌ల్‌

అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫ‌లితం లేద‌ని, త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌న్న ఆవేద‌న‌తో ఓ వ్య‌క్తి క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలోనే ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన సంఘ‌ట‌న క‌డ‌ప జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న క‌లెక్ట‌రేట్‌లోని అధికారుల‌ను, స్థానికుల‌ను ఒక్క‌సారిగా షాక్‌కు గురిచేసింది.

క‌డ‌ప జిల్లా చాపాడుకు చెందిన శెట్టిపల్లి విశ్వనాథరెడ్డి ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో తన భార్యకు ట్యూబెక్టమి ఆపరేషన్ చేయించారు. చికిత్స అనంత‌రం త‌న అనారోగ్యానికి గురైంద‌ని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన భార్య తీవ్ర అనారోగ్యంలో ఇబ్బందులు ప‌డుతుంద‌ని ఆవేదన వ్య‌క్తం చేశారు. గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్ వైద్యుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని మండిపడ్డాడు.

తనకు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌న్న ఆవేద‌న‌తో క‌లెక్ట‌రేట్‌లోని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు య‌త్నించాడు. దీంతో చుట్టుపక్కల ప్రజలు విశ్వ‌నాథ‌రెడ్డిని అడ్డుకున్నారు. బాధితుడికి క‌లెక్ట‌రేట్ అధికారులు ఏ విధ‌మైన హామీ ఇచ్చార‌నే వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment