తిరుమలలో హై అలర్ట్.. ముమ్మ‌రంగా త‌నిఖీలు

తిరుమలలో హై అలర్ట్.. ముమ్మ‌రంగా త‌నిఖీలు

Summarize with AI

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ (Pahalgam) ప్రాంతంలో ఉగ్రవాదులు (Terrorists) పర్యాటకులను (Tourists) లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 27 మంది భారతీయులు (Indians), ఒక నేపాల్ పర్యాటకుడు మృతి చెందారు. పర్యాటకులను టార్గెట్ చేసి జరిగిన ఈ దాడులతో దేశవ్యాప్తంగా అన్ని పర్యాటక ప్రాంతాల్లో హై అలర్ట్ (High alert) కొన‌సాగుతోంది. బుధవారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించగా, గురువారం ముంబై పట్టణంలో కూడా హై అలర్ట్ (High Alert) ప్రకటించారు. ఈ క్రమంలో, దేశంలోని ఇతర పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో పోలీసులు భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేసి, ఎలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

తిరుమలలో భద్రత కట్టుదిట్టం
ఇందులో భాగంగా, తిరుమల తిరుపతిలో (Tirumala Tirupati) భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలకమైన ప్రాంతాల్లో ఉగ్రవాదుల ముప్పు ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో, టీటీడీ (TTD) యంత్రాంగం అలర్ట్ అయింది. అలిపిరి (Alipiri) తనిఖీ కేంద్రం మరియు ఘాట్ రోడ్లలో (Ghat Roads) ఆర్టీసీ బస్సులతో పాటు అన్ని ప్రైవేట్ వాహనాలను, లగేజీని సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. తిరుమల కొండపై (Tirumala Hill) శ్రీవారి ఆలయ పరిసరాల్లో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు.

అనుమానితులపై నిఘా
తిరుమల కొండపై ఎవరైనా అనుమానంగా కనిపించిన వారిని గుర్తించడానికి సెక్యూరిటీ సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. ఈ చర్యలకు సంబంధించిన విజువల్స్ (Visuals) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలపై క్షుణ్ణంగా తనిఖీలు (Thorough Checks) చేస్తున్నారు. తిరుమల కొండపై అనుమానితులపై నిఘా పెంచారు.

Join WhatsApp

Join Now

Leave a Comment