భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పద్మశ్రీ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరుకాకపోవడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. మే 25న న్యూఢిల్లీలో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పలువురు ప్రముఖులు పద్మ అవార్డులు అందుకోగా, రోహిత్ శర్మ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతమైన సేవలు, కెప్టెన్గా సాధించిన విజయాలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం రోహిత్కు పద్మశ్రీ ప్రకటించగా, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ స్వయంగా హాజరై అవార్డును అందుకున్నారు. దీంతో “రోహిత్ ఎందుకు రాలేదు?” అనే ప్రశ్న అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
అయితే రోహిత్ శర్మ గైర్హాజరీ వెనుక ఎలాంటి వివాదం లేదని సమాచారం. వ్యక్తిగత షెడ్యూల్ కారణాల వల్ల ఆయన మొదటి విడత కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని తెలుస్తోంది. సాధారణంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో పలు దశల్లో నిర్వహిస్తారు. అవార్డు గ్రహీతల అందుబాటు, ప్రభుత్వ షెడ్యూల్ ఆధారంగా వేర్వేరు కార్యక్రమాల్లో పతకాలను అందజేస్తుంటారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ త్వరలో జరగబోయే తదుపరి కార్యక్రమంలో అధికారికంగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోనున్నారు. దీనిపై స్పష్టత రావడంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.








పవన్ ‘గన్ సరెండర్’ వెనుక అసలు నిజం ఇదే..