ఢిల్లీలో సీఎం.. కేంద్ర జల్‌శక్తి మంత్రితో రేవంత్ భేటీ

ఢిల్లీలో సీఎం.. కేంద్ర జల్‌శక్తి మంత్రితో రేవంత్ భేటీ

Summarize with AI

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిశారు. ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు ఎంపీలు కూడా పాల్గొన్నారు.

సమావేశంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి సానుకూల నిర్ణయం తీసుకునేలా జోక్యం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. ఈ సందర్భంగా గతంలో 148 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం, ఇప్పుడు 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి కూడా మహారాష్ట్రను ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రాజెక్టు ఎత్తును 150 మీటర్లకు పెంచినా ముంపు ప్రాంతం వెయ్యి హెక్టార్లలోపే ఉంటుందని రేవంత్ రెడ్డి వివరించారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఎత్తిపోతల అవసరం లేకుండా గ్రావిటీ ద్వారానే నీటి సరఫరా చేసే అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రికి తెలిపారు.

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించిన అంతర్రాష్ట్ర అంశాల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. సమావేశంలో ప్రాజెక్టు పురోగతి, సాంకేతిక అంశాలు, రాష్ట్ర ప్రయోజనాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment