పాకిస్తాన్ తన అసలైన రంగు మరోసారి బయటపెట్టింది. 2019లో జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యేలా చేసిన ఉగ్రదాడికి పాకిస్తాన్ ఉన్నత స్థాయి రక్షణాధికారి ఓ అంగీకార ప్రకటన చేశాడు. ఇప్పటి వరకు నెత్తిన వేసుకున్న అపరాధాన్ని ఖండించుకుంటూ వచ్చిన పాకిస్తాన్ ఈసారి మాత్రం సొంతంగా దాన్ని “టాక్టికల్ బ్రిలియన్స్”గా పేర్కొనడం విశేషంగా మారింది.
కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన భీకర బాంబుదాడి వెనుక తమ హస్తం ఉందని పాకిస్తాన్ అధికారికంగా అంగీకరించింది. ఈ దాడిలో 40 మంది పారామిలిటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ వాయుసేనకు చెందిన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ, “పుల్వామాలో మా అద్భుతమైన ఎత్తుగడలను చూపించాం. మా కార్యదక్షత, వ్యూహాత్మక చతురతను ప్రపంచం ముందుంచాం” అని వ్యాఖ్యానించారు.
ఆపరేషన్ సిందూర్కు సంబంధించి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పటి వరకు ఈ దాడికి సంబంధించి బహిరంగంగా అంగీకారం తెలపని పాక్ ప్రభుత్వ ప్రతినిధి ఇలా ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత్, అంతర్జాతీయ సమాజం ఇప్పటికే పాకిస్తాన్పై ఈ దాడికి సంబంధించి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి.