కేటీఆర్‌పై నమోదైన కేసు కొట్టివేత – హైకోర్టు కీలక తీర్పు

Summarize with AI

BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును సమీక్షించిన హైకోర్టు, ఇరు పక్షాల వాదనలు పరిశీలించి ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కేటీఆర్‌పై కేసు నమోదైంది. అయితే, సరైన ఆధారాలు లేవన్న కారణంతో ఈ కేసును కొనసాగించాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చింది. కేటీఆర్ తరఫు న్యాయవాదులు, రాజకీయ ప్రేరేపిత కోణంలో ఈ కేసును చూడడం సమంజసం కాదని వాదించారు.

కేటీఆర్‌కు ఊరట
హైకోర్టు తీర్పుతో కేటీఆర్‌కు న్యాయపరంగా ఊరట లభించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో పెను చర్చకు దారి తీసిన ఈ కేసు, హైకోర్టు తీర్పుతో ముగిసినట్లైంది. అయితే, రాజకీయ నాయకుల వ్యాఖ్యలపై కేసులు నమోదవ్వడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment