తెలంగాణ అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. స్పీకర్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ సస్పెన్షన్ బడ్జెట్ సెషన్ ముగిసేంతవరకు కొనసాగనుంది అని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు.
సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడిన వెంటనే, జగదీశ్ రెడ్డి సభను విడిచిపెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు, అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో సభలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.