అమెరికా-ఇరాన్ (United States-Iran) మధ్య కుదిరిన శాంతి ఒప్పందం (Peace Agreement) ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊరటనిచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) తిరిగి తెరవడానికి ఇరాన్ అంగీకరించగా, అమెరికా కూడా అక్కడ అమలు చేసిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేసింది. దాదాపు రెండు నెలలుగా నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు ఎగుమతులు మళ్లీ ప్రారంభమవడంతో ప్రపంచ మార్కెట్లలో (Global Markets) సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే లక్షలాది బారెళ్ల చమురుతో భారీ ట్యాంకర్లు సముద్ర మార్గంలో ప్రయాణం ప్రారంభించాయి.
శాంతి ఒప్పందం ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్పై వెంటనే కనిపించింది. గత కొన్ని నెలలుగా 100 డాలర్లకు పైగా పలికిన బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 80 డాలర్ల దిగువకు పడిపోయింది. డబ్ల్యూటీఐ(WTI), మర్బన్ క్రూడ్ ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. చమురు ధరలు తగ్గడంతో ఇంధన వ్యయాలు తగ్గి, అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఊరట లభించనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.









బాబు పాలనలో గంజాయి పంటకే గిట్టుబాటు ధర