పోసాని కృష్ణమురళీ అక్రమ అరెస్ట్ను మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు తీవ్రంగా ఖండించారు. మచిలీపట్నంలో పేర్ని కిట్టు మీడియాతో మాట్లాడారు. ఏపీలో అరెస్టుల పర్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గుర్తుచేస్తోందన్నారు. ఇలాంటి ఘటనలను ఇంతకుముందెన్నడూ ఎక్కడా జరగలేదన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే అరెస్టులు చేస్తున్నారని, మరి టీడీపీ, జనసేన పెట్టిన పోస్టుల సంగతేంటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులకు పర్యవసానం కచ్చితంగా అనుభవిస్తారని, రూల్స్ దాటి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న అధికారులను గుర్తు పెట్టుకుంటామని పేర్ని కిట్టు హెచ్చరించారు.
News Wire
-
01
ఢిల్లీలో వర్షం ఎఫెక్ట్
భారీ వర్షం కారణంగా 15 విమానాల దారి మళ్లింపు. జైపూర్కు 12 విమానాలు, చండీగఢ్కు రెండు, లక్నోకు ఒక విమానం మళ్లింపు
-
02
కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధం
కొండా సురేఖతో పాటు మరో ఇద్దరి వ్యవహారంపై కఠిన నిర్ణయం తీసుకునేలా క్రమశిక్షణ కమిటీ సిఫారసు. నివేదిక సిద్ధం చేసిన కమిటీ
-
03
నేడు వైసీపీ బీసీ నేతల సమావేశం
వైసీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ. రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులు, బీసీల కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చ
-
04
ఏపీలో 14వ రోజుకు జూడాల సమ్మె
ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల సమ్మె 14వ రోజుకు చేరింది. స్టైపెండ్ పెంచే వరకు సమ్మె విరమించమంటున్న జూడాలు
-
05
రెండోరోజు బ్రిక్స్ దేశాల కీలక మీటింగ్
విశాఖలో నేడు యువజన, క్రీడా మంత్రుల సమావేశం. నేడు బీచ్రోడ్లో ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ. హాజరుకానున్న కేంద్రమంత్రి మన్సుఖ్
-
06
విజయవాడలో యువ సదస్సు
భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రెండవ రోజు యువ సదస్సు. వికసిత్ భారత్ @2047- యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ పేరిట సదస్సు
-
07
ఎకరం భూమి రూ. 264 కోట్లు..
హైదరాబాద్లో రికార్డు ధరలు. రాయదుర్గంలో TGIIC వేసిన భూముల వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరం భూమి ధర
-
08
షావుకారు జానకి మృతి
సీనియర్ నటి షావుకారు జానకి చెన్నై కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత. 400కు పైగా సినిమాల్లో నటించిన జానకి
-
09
ఉయ్యూరులో డయేరియా
కృష్ణా జిల్లా ఉయ్యూరులో ప్రబలిన డయేరియా. ఆస్పత్రిలో చేరిన 30మంది బాధితులు. నీటి శాంపిల్స్ సేకరించిన వైద్య శాఖ అధికారులు
-
10
కర్నూలులో న్యాయవాదుల ఆందోళన
కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్. కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు న్యాయవాదుల బైక్ ర్యాలీ








