కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధం!

కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధం!

Summarize with AI

తెలంగాణ కాంగ్రెస్‌లో (Telangana Congress) మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కొండా సురేఖతో పాటు మరో ఇద్దరి వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకునేలా పార్టీ క్రమశిక్షణ కమిటీ (Disciplinary Committee) సిఫారసు (Recommendation) చేసినట్లు సమాచారం. ఈ మేరకు కమిటీ తన నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

క్రమశిక్షణ కమిటీ సిద్ధం చేసిన నివేదికను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan), టీపీసీసీ(TPCC) అధ్యక్షుడికి అందజేయనున్నట్లు సమాచారం. అనంతరం నివేదికను ఏఐసీసీకి(AICC) పంపేందుకు టీపీసీసీ నాయకత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(Revanth Reddy) భేటీ అయ్యారు. కొండా సురేఖ ఎపిసోడ్‌తో (Konda Surekha Episode) పాటు రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణను కాపాడటం, నాయకుల మధ్య విభేదాలు మరింత ముదరకుండా చూడటం వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

కొండా సురేఖతో పాటు మరో ఇద్దరిపై క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫారసుల నేపథ్యంలో తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. కమిటీ నివేదికను పరిశీలించిన అనంతరం ఏఐసీసీ (AICC) తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సాయంత్రం నివేదికను ఏఐసీసీకి పంపేందుకు టీపీసీసీ చీఫ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో కొండా సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్ఠానం (Congress High Command) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment