పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది.. భారత్ లక్ష్యం ఎంతంటే..

పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది.. భారత్ లక్ష్యం ఎంతంటే..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భార‌త్-పాకిస్తాన్ (INDvsPAK) దుబాయ్ వేదిక‌గా ప్రారంభ‌మైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 50 ఓవ‌ర్ల‌లో ఇంకా రెండు బంతులు మిగిలి ఉండ‌గానే 241 పరుగులు చేసి ఆలౌటైంది. పాకిస్తాన్ బ్యాట‌ర్స్ షకీల్ (62), రిజ్వాన్ (46), కుష్ దిల్ (38) మెరుగైన ప్రదర్శన చూపించారు.

భారత బౌలర్లలో కుల్దీప్ మూడు వికెట్లు పడగొట్టగా, హార్దిక్ రెండు వికెట్లు తీశాడు. అక్షర్, జడేజా, హర్షిత్ ఒక్కొక్క వికెట్ తీసి తమ వంతు పాత్ర పోషించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 50 ఓవర్లలో 242 పరుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగుతోంది. మొద‌టి బ్యాచ్ విజ‌యంతో జోష్ మీదున్న భార‌త్ ఈ కీలక పోరులోనూ విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment