చిత్తూరులో ఉద్రిక్త‌త‌.. భూమన అభినయ్‌పై దాడికి యత్నం

చిత్తూరులో ఉద్రిక్త‌త‌.. భూమన అభినయ్‌పై దాడికి యత్నం

డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చిత్తూరులో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. అధికార కూట‌మి పార్టీల నేత‌లు వైసీపీ కార్పొరేటర్లు ఉండే హోటల్‌ను కూట‌మి నేత‌లు నిర్బంధించారు. డిప్యూటీ మేయ‌ర్ ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదంటూ తిరుపతి జ‌న‌సేన‌ ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులు కొడుకు ఆరణి మదన్, అనుచరులు భాస్క‌ర్ హోట‌ల్ వ‌ద్ద దౌర్జ‌న్యం ప్ర‌ద‌ర్శించారు. చిత్తూరులో భాస్కర హోటల్‌లో ఉన్న వైసీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు అక్ర‌మంగా నిర్బంధించి హోటల్ బయట కార్లు అడ్డంగా పెట్టి బయటకు వెళ్లకుండా అడ్డుకున్న‌ట్లు తెలుస్తోంది.

కూట‌మి నేత‌లు నిర్బంధించిన కార్పొరేట‌ర్ల‌ను విడిపించేందుకు తిరుప‌తి వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త భూమన అభినయ్ రెడ్డి హోట‌ల్‌కు వెళ్లి, సంఖ్యాబ‌లం లేక‌పోయినా దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డ‌డం క‌రెక్ట్ కాదు, త‌ప్పు చేస్తున్నారంటూ కూట‌మి పార్టీల నేత‌ల‌తో వారించారు. దీంతో కూట‌మి నేత‌లు భూమ‌న అభిన‌య్‌పై దాడి చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు హోట‌ల్‌కు చేరుకున్నారు. దీంతో కూటమి నేత‌లు వెనక్కి తగ్గారు. అనంత‌రం భాస్కర హోటల్ నుంచి వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు తిరుప‌తి బయల్దేరారు. హోట‌ల్‌లో ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

రెండ్రోజుల క్రితం వైసీపీ డిప్యూటీ మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన శేఖ‌ర్‌రెడ్డి ఆస్తుల ధ్వంసానికి య‌త్నించారు. అన్ని అనుమ‌తుల‌తో భ‌వ‌నాలు నిర్మించిన‌ప్ప‌టికీ, వాటిని కూల్చేందుకు అధికారులు ప్ర‌య‌త్నించ‌డంతో భూమ‌న అభిన‌య్‌రెడ్డి త‌న అనుచ‌రుల‌తో వెళ్లి కూల్చివేత‌ల‌ను అడ్డుకోగా, ఆయ‌న్ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment