భారత క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన శిఖర్ ధావన్ (Shikhar Dhawan), ఇప్పుడు యూటర్న్ తీసుకుంటూ భారత జట్టులో మరోసారి అడుగుపెట్టాడు. ఈ ఏడాది జరగబోయే ‘వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్’ రెండో ఎడిషన్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు ఆయన సైన్ చేశారు.
ధావన్ రీ-ఎంట్రీపై జట్టు యజమాని ఆనందం
39 ఏళ్ల ధావన్ తన కెరీర్లో అనేక రికార్డులను సాధించి అభిమానుల గుండెల్లో నిలిచాడు. ఇప్పుడు మరోసారి జట్టులోకి రావడంతో జట్టు యజమాని సుమంత్ బహల్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. “ధావన్ చేరికతో జట్టు మరింత బలంగా తయారవుతుంది” అని ఆయన పేర్కొన్నారు.
ఈ నిర్ణయం ధావన్ అభిమానులను కూడా ఆకట్టుకుంటోంది, అతని లెజెండరీ ఫార్మ్ను మళ్లీ చూడగలమన్న ఉత్సాహంతో క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తోంది.








