పుష్ప 2 సినిమాతో భారీ విజయంతో ఎంజాయ్ చేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు గాయం అయ్యింది. జిమ్ చేస్తూ దురదృష్టవశాత్తూ గాయపడినట్లుగా తెలుస్తోంది. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటోంది. అయితే దీనివల్ల ఆమె నటిస్తున్న సినిమాల షూటింగులు ఆగిపోయాయి. ప్రస్తుతం ఆమె వేగంగా కోలుకుంటోంది. త్వరలోనే మళ్లీ షూటింగులు మొదలు పెడుతుంది అని ఆ వర్గాలు తెలిపాయి. రష్మిక గాయం చిన్నదే అయినా.. ఆమె చేతుల్లో ప్రస్తుతం వివిధ ప్రాజెక్టులు ఉన్న కారణంగా కాస్త విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.
రష్మిక త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్నా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి సికందర్ మూవీ షూటింగ్ చేస్తోంది. ఈ సినిమాను ఏఆర్ మురగదాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఆమె గాయం కారణంగా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయినట్లుగా సమాచారం.