తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఓ ప్రత్యేకమైన అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చినప్పుడు జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నారు.
ధోని సినిమాలో అవకాశం.. కానీ..
ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన బయోపిక్లో నటించే అవకాశం తనకు వచ్చిందని, దర్శకుడు, నిర్మాతలు మొదట ఆమెను ఎంపిక చేసినప్పటికీ, అప్పటి బిజీ షెడ్యూల్ కారణంగా ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని రకుల్ చెప్పారు. ఆ సమయంలో రామ్ చరణ్తో బ్రూస్లీ చిత్రంలో రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉండటంతో, నా డేట్స్ కుదరలేదు. అందుకే ఎంఎస్ ధోని చిత్రానికి ‘నో’ చెప్పాల్సి వచ్చింది” అని రకుల్ వివరించారు.
ఈ నిర్ణయం తీసుకోవడం ఎంత కష్టం అనిపించిందో కూడా రకుల్ చెప్పుకొచ్చారు. ఇలాంటి మంచి సినిమా కోల్పోవడం చాలా బాధగా అనిపించింది అని ఆవేదన వ్యక్తం చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా నెపోటిజం వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులు మరియు కెరీర్లో కొన్ని కీలక నిర్ణయాలు ఎలా ప్రభావం చూపాయనే విషయాలు ఆమె అభిమానులను ఆలోచనలో పడేస్తున్నాయి.